వెంకట్ రామ్జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కసండ్ర హీరోయిన్ గా రూపొందుతోన్న థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మొదట ఆగష్టు 23న విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. కాగా తాజాగా విడుదల తేదిని వారం రోజుల ముందుకు మార్చి.. సినిమాను ఆగష్టు 15నే రిలీజ్ చేయనున్నారు.
ఇక అదే రోజున సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన ‘రణరంగం’ చిత్రం కూడా విడుదల కానుంది. ఇక ‘ఎవరు’ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.