బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జాట్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక మేకర్స్ ఈ చిత్ర సీక్వెల్ను కూడా అనౌన్స్ చేశారు.
అయితే, ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో సన్నీ డియోల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రం కోసం తాను రెడీ అవుతున్నట్లు సన్నీ పేర్కొన్నాడు. సన్నీ డియోల్ కెరీర్లో క్లాసిక్ చిత్రంగా నిలిచిన ‘బోర్డర్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ను దర్శకుడు అనురాగ్ సింగ్ ప్రెస్టీజియస్గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్లో త్వరలోనే తాను జాయిన్ కాబోతున్నట్లు సన్నీ డియోల్ తెలిపాడు.
బాలీవుడ్ ఆడియెన్స్తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయిన సన్నీ డియోల్ ఇప్పుడు ‘బోర్డర్-2’ మూవీ కోసం రెడీ అవుతుండటంతో ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నాటి ‘బోర్డర్’ చిత్రం లాగా ఈ సీక్వెల్ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.