“RRR” తర్వాత టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్? ఎంతవరకు నిజమో

“RRR” తర్వాత టాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్? ఎంతవరకు నిజమో

Published on Aug 17, 2021 7:04 AM IST

ప్రస్తుతం ఒక్క మన టాలీవుడ్ నుంచే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మరియు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే చెప్పాలి.. దీనిపై ఇప్పుడు ఉన్న అంచనాలు అనేకం.. అయితే దీనిని తలదన్నే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది అని సినీ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న టాక్.

అది కూడా ఇప్పుడు RRR లో కీలక హీరో చరణ్ ఒకడు కాగా మరొక హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అని టాక్.. అయితే ఇందులో ఎంతమేర నిజం ఉంది అన్నది అసలు ప్రశ్న. సినిమా వర్గాల్లో అయితే ఈ టాక్ వైరల్ అవుతుంది కానీ నిజానికి ఈ కాంబోపై ఇంకా ఎలాంటి చర్చ రాలేనట్టే తెలుస్తుంది. దీనితో ప్రస్తుతానికి ఈ వైరల్ అవుతున్న ఇన్ఫో అసత్యం అనే చెప్పాలి. ఒకవేళ నిజం అయితే కనుక దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు