కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుదలను త్వరలోనే నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
August 9th here we come!! And the laughter begins!!#Manmadhudu2 #Manmadhudu2OnAugust9th@rakulpreet @vennelakishore @23_rahulr @Annapurnastdios @AnandiArtsOffl @Viacom18Studios @mynnasukumar. @chaitanmusic @ChotaKPrasad @iaksharagowda pic.twitter.com/Ab0Pc8L0Cz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 15, 2019