సుశాంత్ మరణం విషయంలో కీలక రిపోర్ట్ అందజేసిన ఎయిమ్స్!

సుశాంత్ మరణం విషయంలో కీలక రిపోర్ట్ అందజేసిన ఎయిమ్స్!

Published on Sep 29, 2020 4:04 PM IST

గత జూన్ నెలలో బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా తన నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యగా మొదలైన ఈ సున్నితమైన అంశం ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ ఇన్ని నెలలు కొనసాగుతూ వచ్చింది.

అయితే ఈ కేసును ఇప్పటి సిబిఐ వారు విచారణ జరుపుతూ ప్రధాన వ్యక్తులు అందరిని అన్ని కోణాల్లో విచారించింది. అయితే తాజాగా ఎయిమ్స్ వారు సిబిఐ కి ఒక కీలక రిపోర్టును అందించారట. ఈ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ శరీరంలో ఎలాంటి విషము లేదని ఇది ఆత్మహత్య మాత్రమే అని వారు తెలిపారు.

అంతే కాకుండా ఆ సమయంలో సుశాంత్ మానసికంగా బాధ పడి ఉంటాడని అందుకే ఆత్మ హత్య చేసుకున్నాడని ఆ రిపోర్ట్ లో తెలిపారు. ఇప్పటికే అతని శరీరంపై ఉన్న అనుమానాస్పద గుర్తులు ఏమిటని అనేక అనుమానాలు ఉన్నాయి మరి వాటి పరంగా కూడా ఆరా తీసి అసలు సుశాంత్ అభిమానులు మరియు సానుభూతి పరులు ఇంకా పోరాటం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు