అజిత్ గాయాల నుండి కోలుకున్నట్టే

అజిత్ గాయాల నుండి కోలుకున్నట్టే

Published on Feb 21, 2020 10:13 PM IST

తమిళ స్టార్ హీరో అజిత్ ‘వాలిమై’ షూటింగ్లో బైక్ చేజింగ్ సన్నివేశం చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం చిన్నదే కావడంతో ప్రమాదం జరిగిన రోజు కూడా అజిత్ షూటింగ్ పూర్తిచేశారు. అనంతరం చికిత్స తీసుకున్నారు. ట్రీట్మెంట్ తర్వాత అజిత్ పూర్తిగా కోలుకున్నారు. ఈరోజు ఉదయం చెన్నైలోని లీలా ప్యాలెస్ నందు జరిగిన ఒక వివాహా వేడుకకు అజిత్ హాజరయ్యారు. క్లీన్ షేవ్, ఫుల్ బ్లాక్ సూట్ ధరించిన అజిత్ పూర్తిగా కోలుకున్నట్టే కనిపించారు. దీంతో ఆయన అభిమానుకు వెల్కమ్ బ్యాక్ అజిత్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు.

ఇకపోతే హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు