అఖిల్ ఆ సినిమాని పక్కకు పెట్టేసినట్లేనా ?

అఖిల్ ఆ సినిమాని పక్కకు పెట్టేసినట్లేనా ?

Published on Feb 20, 2019 3:54 PM IST

యువ హీరోఅక్కినేని అఖిల్ మూడో ప్రయత్నంలో కూడా విజయం సాధించలేకపోయాయడు. ఇటీవల మిస్టర్ మజ్ను అంటూ వచ్చిన అఖిల్ ఈచిత్రం తో కూడా హిట్ కొట్టలేకోపోయాడు. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మలుపు ఫేమ్ సత్య పినిశెట్టి తో సినిమా ని అంగీకరించాడు. మిస్టర్ మజ్ను తరువాత అఖిల్ చేయబోయే సినిమా ఇదేనని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట.

గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. బొమ్మరిల్లు తరహాలో ఇది కూడా ఫ్యామిలీ డ్రామా అట. మరి అఖిల్ ఈ సినిమా తరువాతైనా సత్య పినిశెట్టి తో సినిమా చేస్తాడో లేక మొత్తానికే పక్కకు పెట్టేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు