‘మిస్టర్ మజ్ను’ క్లారిటీ ఇచ్చాడు !

‘మిస్టర్ మజ్ను’ క్లారిటీ ఇచ్చాడు !

Published on Nov 28, 2018 8:36 AM IST

అఖిల్ , హలో చిత్రాల తరువాత యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. తాజాగా ఈ చిత్రం ఫై అఖిల్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్యాచ్ వర్క్ శరవేగంగా జరుగుతుందని డిసెంబర్ 3 కల్లా ఒక్క సాంగ్ మినహా సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. అలాగే ఈచిత్రాన్ని జనవరి లో విడుదల చేయనున్నామని ఈ విషయంలో ఓపికగా ఉన్న అభిమానులకు నా ధన్యవాదాలని అఖిల్ ట్వీట్ చేశాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు