మన టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అసలు ఎవరూ ఊహించని కాంబో తారక్ మరియు చరణ్ లాంటి ఇద్దరు సాలిడ్ మాస్ పర్సనాలిటీస్ తో సెట్ చేసి మరోసారి ఇండియన్ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు.
ఇక ఇప్పుడు సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉండగా నిన్ననే మేకర్స్ ఒక అదిరే మేకింగ్ వీడియోని వదిలారు. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మేకింగ్ వీడియో వచ్చిన తర్వాత రాజమౌళిపై అనేక ప్రశంసలు కురిసాయి.
కానీ అందులో తన గొప్పదనం ఏమీ లేదని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉండగా తన టీం కార్తికేయ, వంశీ, ప్రదీప్, వాల్ ట్రెండ్స్ వారికి రెండు నెలల పనిలా అప్పగించేసానని వారే ఇదంతా చూసుకున్నారని తెలిపారు. అలాగే స్పెషల్ థాంక్స్ గా రాప్ సాంగ్ యూనిట్ కి అలాగే అసలు ఈ మేకింగ్ వీడియో విజువల్స్ ని తీసిన శ్రీనివాస్ కి మరిన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Thank you @achurajamani, @rblaaze, @rockstaradityaz for the captivating music, rap and lines respectively..@SrinivasGMovie for all the innovative angles to capture the making footage.
— rajamouli ss (@ssrajamouli) July 16, 2021