రాజ్ తరుణ్ ఓటిటి డెబ్యూ స్ట్రీమింగ్ కి ఆల్ సెట్.!

రాజ్ తరుణ్ ఓటిటి డెబ్యూ స్ట్రీమింగ్ కి ఆల్ సెట్.!

Published on Nov 16, 2022 1:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో తన కెరీర్ ఆరంభంలోనే మంచి విజయాలు అందుకున్న హీరో రాజ్ తరుణ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో తాను కూడా సినిమాలు చేస్తూనే ఓటిటి లోకి కూడా అడుగు పెట్టి చేసిన మొదటి వెబ్ సిరీస్ నే “అహ నా పెళ్ళంట”.

రాజ్ తరుణ్ ఓటీటీ డెబ్యూ అహ నా పెళ్ళంట రేపే రిలీజ్ అవుతుంది. మరి ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ గా రాహుల్ మరియు సాయి డీప్ లు తెరకెక్కించిన ఈ ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ తో ప్రముఖ ఓటిటి యావ్ జీ 5 లో రేపు నవంబర్ 17న స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపొయింది.

ఇక ఈ సిరీస్ లో అయితే శివాని రాజశేఖర్ ఫీమేల్ లీడ్ లో నటించగా పోసాని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి టీజర్, ట్రైలర్స్ తో మంచి బజ్ అందుకున్న ఈ సిరీస్ ఫైనల్ గా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఇక రేపటి నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు