అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అయింది !

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ అయింది !

Published on Dec 31, 2018 11:42 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని చేయబోతున్నారు. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రం పై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా తెలియజేయటం జరుగుతుంది. 2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు).

సంబంధిత సమాచారం

తాజా వార్తలు