అల్లు అర్జున్ బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నాడా ?

అల్లు అర్జున్ బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నాడా ?

Published on Oct 21, 2018 6:48 PM IST

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది డైరెక్టర్ల దగ్గర ఎన్నో కథలు వినడం కూడా జరిగింది. అయితే బన్నికి ఏ కథ నచ్చలేదని తెలుస్తోంది. అయితే క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్ని తన తదుపరి చిత్రం చేయబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓ బాలీవుడ్‌ చిత్రం అల్లు అర్జున్‌ కి బాగా నచ్చిందని.. ఇప్పుడు ఆ చిత్రాన్నే తెలుగులో రీమేక్‌ గా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రాన్ని అల్లు అర్జున్ తెలుగులో చేయబోతున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

తాజాగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ను తీసి భారీ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం అందుతుంది. అయితే ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి ఆదరికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు