వోడాఫోన్‌ మీద ఫైర్ అయిన మెగా మేనల్లుడు !

వోడాఫోన్‌ మీద ఫైర్ అయిన మెగా మేనల్లుడు !

Published on Jun 21, 2018 11:05 PM IST

మెగాస్టార్ మేనల్లుడు, స్టైలిష్ స్టార్ తమ్ముడైన అల్లు శిరీష్ వోడాఫోన్‌ సంస్థ పై ఫైర్ అవుతూ అతి చెత్త నెట్‌వ‌ర్క్‌ అంటూ తీవ్రంగా విమర్శించారు. వివరాల్లోకి వెళ్తే వోడాఫోన్‌ నెట్‌వ‌ర్క్‌ 4జీ సిగ్నల్ అని చెప్పి కనీసం 2జీ సిగ్న‌ల్ కూడా రాకుండా అల్లు శిరీష్‌ ను చాలా ఇబ్బంది పెట్టిందట. దాంతో శిరీష్ తన ట్వీటర్ ద్వారా త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్త పరుస్తూ…’మీ ద‌గ్గ‌ర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది దూర‌మ‌య్యాకే దాని విలువ గుర్తించ‌గలం. ఈ మ‌ధ్య‌నే నేను ఎయిర్‌టెల్ నుంచి వోడాఫోన్‌కు పోర్ట్ అయ్యాను. అది అత్యంత చెత్త ఆలోచ‌న అని నాకిప్పటికి అర్ధమైంది. నేను చెత్త నెట్‌వ‌ర్క్ నుంచి మ‌రింత చెత్త నెట్‌వ‌ర్క్‌కు మారాను. వోడాఫోన్ 4జీ కాదు క‌దా.. క‌నీసం 2జీ సిగ్న‌ల్ కూడా స‌రిగ్గా రావట్లేదు. కాల్ డ్రాపింగ్ కాదు.. ఒక్కోసారి ఏకంగా సిగ్న‌లే ఉండ‌దు. గుణ‌పాఠం నేర్చుకున్నాను` అని అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అల్లు శిరీష్ మ‌ల‌యాళం స్టార్ ‘మోహ‌న్ లాల్‌’ తో కలిసి నటించిన తెలుగు అనువాద చిత్రం ‘యుద్ధభూమి’ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. కొన్ని వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్, శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు