‘నేల టిక్కెట్టు’ చిత్రం తరువాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇక గత కొంత కాలంగా పరాజయాలతో సతమవుతున్న రవితేజ మరియు శ్రీను వైట్లకు ఈ చిత్ర విజయం కీలకం కానుంది.
- క్రైమ్ కామెడీ నేపథ్యంలో వినూత్నంగా !
- డార్క్ కామెడీ సినిమాకి సెన్సార్ అయింది !
- అఖిల్ ఆ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లే !
- నాని సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ !
- ఇంటర్వ్యూ : రాయ్ లక్ష్మీ – ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మంచి కామెడీ ఎంటర్టైనర్ !