ముగింపు వీడియోతో ‘ప్రతిరోజూ పండగే’ !

ముగింపు వీడియోతో ‘ప్రతిరోజూ పండగే’ !

Published on Nov 13, 2019 6:36 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ అంటూ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుతోటి ‘ప్రతిరోజూ పండగే’ షూటింగ్ కి ముగింపు పలికింది చిత్రబృందం. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మొత్తానికి ‘ప్రతిరోజూ పండగే’ పూర్తయింది. మీకు సమీపంలో ఉన్న థియేటర్స్ లో డిసెంబర్ 20 నుండి ఈ సినిమా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక మా సినిమా నుండి 2వ సింగిల్ ‘ఓ బావ’ త్వరలోనే మీ ముందుకు రానుంది’ అని పోస్ట్ చేసింది చిత్రయూనిట్.

కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు