క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న అంజలి త్రీడి చిత్రం ‘లిసా’ !

క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న అంజలి త్రీడి చిత్రం ‘లిసా’ !

Published on Nov 8, 2018 10:00 AM IST

నూతన దర్శకుడు రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లిసా’. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు తమ అనుభవాలు పంచుకున్నారు. మొదటగా చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ. 100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది. .అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టైటిల్ రోల్‌లో ఆమె ఆ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. నటుడు సామ్ జోన్స్ ఇందులో మంచి పాత్ర చేశారు. చాలా మంచి నటుడు. ఇక . ఈ చిత్రంలో బ్రహ్మానందం గారు నటిస్తున్నారు.

నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ ఈ చిత్రానికి నేను నిర్మాణ బాధ్యతతో పాటుగా సినిమాటోగ్రఫర్‌గా కూడా వ్యవహరిస్తూన్నాను. ప్రస్తుతం లిసా డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ఇందులో అంజలి గారి నటన అద్భుతం అని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. స్క్రిప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ రాజు అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. గతంలో ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అంజలి పోస్టర్‌తో కూడిన ‘లిసా’ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ విడుదల చేశారు. అందుకు పూరీ జగన్నాధ్ గారికి మా చిత్ర యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా ఈ సినిమాను హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. ఈ సినిమాను ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ మా లిసా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆడియో, ట్రైలర్‌లను విడుదల చేసి సినిమాను కూడా అతి త్వరలో విడుదల చేస్తాం అన్నారు.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ మొదటి సారి 3డీ చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజుకు స్క్రిప్ట్ పై మంచి క్లారిటీ ఉంది.. ఏదైతే చెప్పారో అదే తీశారు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. నిర్మాత మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌ను ప్రెజెంట్ చేస్తున్న ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మించారు. సంతోష్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇలాంటి మంచి ప్రొడక్షన్‌లో పని చేయడం కంఫర్ట్‌గా, హ్యాపీగా ఉందని ’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు