టాలీవుడ్ లోకి మరొక డిజిటల్ ప్లాట్ ఫాం… తొలి ప్రీమియర్ గా పిజ్జా 2

టాలీవుడ్ లోకి మరొక డిజిటల్ ప్లాట్ ఫాం… తొలి ప్రీమియర్ గా పిజ్జా 2

Published on Sep 29, 2020 7:02 PM IST


తెలుగు చిత్ర పరిశ్రమలో కి మరొక డిజిటల్ ప్లాట్ ఫాం ఎంటర్ కాబోతుంది. ఫిలిమ్ అనే పేరుతో తన సత్తా ను చాటేందుకు సిద్దం అవుతుంది.ఈ ఓటిటీ రాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. అయితే ఈ సరికొత్త ప్లాట్ ఫాం లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల తో పాటుగా ఇండిపెండెంట్ మూవీస్ కూడా స్ట్రీమ్ కానున్నాయి. అయితే ఇతర డిజిటల్ ప్లాట్ ఫాం లతో పోల్చితే దీనికి సబ్ స్క్రిప్షన్ ఛార్జ్ లు తక్కువగా ఉందనున్నాయి. ఈ ఓటిటి ను యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ కలిసి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ఈ ఓటిటి విజయ దశమి పండుగ ముందు లాంచ్ కానుంది. ఇందులో మొదటగా విజయ్ సేతుపతి నటించిన పిజ్జా 2 మమ్ముట్టి నటించే రంగూన్ రౌడీ ప్రియమణి విస్మయ వంటి అనేక చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి. అయితే ఇందులో మొదటగా పిజ్జా 2 తొలి ప్రీమియర్ కానుంది. అయితే ఈ ఫిలిమ్ ఓటిటీ లో రాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు వాటి విడుదల తేదీలు, పాటలు, టీజర్స్, ట్రైలర్స్ అన్ని కూడా ఫిలిమ్ యూ ట్యూబ్ చానెల్ లో అందుబాటులో రానున్నాయి. సరికొత్త ప్లాట్ ఫాం పై ప్రేక్షకులు, అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు