“ప్రతినిధి” కి మరో సీక్వెల్..!

“ప్రతినిధి” కి మరో సీక్వెల్..!

Published on May 10, 2024 11:17 AM IST

టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ హీరోగా చాలా రోజులు తర్వాత హీరోగా మళ్ళీ తన పొలిటికల్ హిట్ చిత్రం “ప్రతినిధి” కి సీక్వెల్ తో పలకరించేందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో ప్లాన్ చేసిన చిత్రమే ఇది. మరి ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది.

మరి ఈ సినిమాకి కొనసాగింపు సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఇందుకు పార్ట్ 2 కూడా ఎలా రన్ అయ్యింది అనేది కూడా ప్రధాన అంశంగా తీసుకోవాలి. మరి ప్రతినిధి 2 ఎలాంటి రన్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, సచిన్ ఖేడేకర్ తదితరులు నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. అలాగే కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు సిరి తోట అలాగే సురేంద్రనాథ్ బొల్లినేని లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు