మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో దర్శకుడు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓదెల 2”. తమన్నా సహా టాలెంటెడ్ నటుడు వశిష్ట నటించిన ఈ డివోషనల్ హారర్ డ్రామా నేడు థియేటర్స్ లోకి వచ్చింది. అయితే దీనికి ముందు ఆల్రడీ ఓ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటిటిలో విడుదల అయ్యిన ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా ఓటిటిలో రెస్పాన్స్ అందుకుంది.
అయితే ఫైనల్ గా ఈ సినిమాకి సీక్వెల్ పార్ట్ 2 థియేటర్స్ లోకి రాగ మేకర్స్ ఫైనల్ గా ఈ సిరీస్ లో ముచ్చటగా మూడో సినిమాను కూడా అనౌన్స్ చేసేసారు. దీనితో ఓదెల 3 కూడా ఆడియెన్స్ ని అలరించేందుకు రానుంది అని చెప్పవచ్చు. మరి ఇపుడు పార్ట్ 2 రేంజ్ లో రాణిస్తుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా డి. మధు నిర్మాణం వహించారు.