ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఆయన కెరీర్లో 38వ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ సర్కిల్స్తో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వారు అనౌన్స్ చేశారు. ఆమెకు సంబంధించి ఓ ప్రీ-లుక్ పోస్టర్ కూడా వారు రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.