అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదాపడ్డట్టే

అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదాపడ్డట్టే

Published on Jan 21, 2020 3:00 AM IST

స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి జనవరి 31న విడుదల చేయాలని అనుకున్నారు. ఈ తేదీని చాలారోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

కానీ ఎలాంటి విడుదల సన్నాహాలు కనిపించడంలేదు. ఎక్కడా రిలీజ్ హడావుడి లేదు. చిత్ర బృందం నుండి ప్రమోషన్స్, అప్డెట్స్ లాంటివి ఏవీ రావట్లేదు. దీంతో విడుదల వాయిదా కన్ఫర్మ్ అని తేలిపోయింది. ఈ వాయిదాకు కారణం సాంకేతిక కారణాలే అని తెలుస్తోంది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన స్వీటీ ఫ్యాన్స్ కొత్త డేట్ ఎప్పుడో చెప్పాలని కోరుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో మాధవన్, అంజలి, షాలిని పాండేలతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసెన్ కూడా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు