తెలుగు రాష్ట్రాలలో మహేష్ లాభాలు పండిస్తున్నాడు..!

తెలుగు రాష్ట్రాలలో మహేష్ లాభాలు పండిస్తున్నాడు..!

Published on Jan 20, 2020 11:24 AM IST

మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల జోరు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలోనే ఈ చిత్ర వసూళ్లు వంద కోట్ల షేర్ కి దగ్గరయ్యాయి.నైజాం లో సరిలేరు నీకెవ్వరు 9 రోజులకు రూ. 32.1 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం విశేషం.

సీడెడ్ లో రూ. 14.25 కోట్లు, గుంటూరులో రూ. 8.88 కోట్లు, కృష్ణ రూ.7.77 కోట్ల షేర్ వసూలు చేసింది. చాలా ఏరియాలలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ దాటి లాభాలలోకి ప్రవేశించింది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా 9 రోజులకు ఏపీ/తెలంగాణాలలో కలెక్షన్స్ వివరాలు…

నైజాం – 32.1 కోట్లు
సీడెడ్ – 14.25 కోట్లు
ఉత్తరాంధ్ర – 16.2 కోట్లు
గుంటూరు – 8.88 కోట్లు
ఈస్ట్ – 9.75 కోట్లు
వెస్ట్ – 6.36 కోట్లు
కృష్ణ – 7.77 కోట్లు
నెల్లూరు – 3.51 కోట్లు

ఏపీ/తెలంగాణాలలో 9 రోజులకు రూ.98.82 కోట్ల షేర్..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు