ఏప్రిల్ 28 ఏం జరిగింది హీరో డాక్టర్ రంజిత్‌తో ఇంటర్వ్యూ..!

ఏప్రిల్ 28 ఏం జరిగింది హీరో డాక్టర్ రంజిత్‌తో ఇంటర్వ్యూ..!

Published on Feb 24, 2021 7:03 PM IST

సాధారణంగా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని చాలా మంది చెబుతుంటారు. అయితే డా.రంజిత్ మాత్రం ముందుగా ఆయుర్వేద డాక్టర్‌గా పేరు సంపాందించి ఇప్పుడు యాక్టర్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా డా.రంజిత్‌తో ఇంటర్వ్యూ జరిపాము.

మా నాన్న ఎలూర్చి వెంకట్రావు ఆయుర్వేద డాక్టర్‌గా మంచి పేరు సంపాదించారు. అయితే సినిమాలపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉందని, సినీ రైటర్స్ అసోసియేషన్‌ను కూడా నాన్న ప్రారంభించారని అన్నారు. గాడ్‌ఫాదర్, మావూరి మారాజు, ఇంటింటి దీపావళి, ప్రజల మనిషితో పాటు చాలా సినిమాలకు నాన్న రచయితగా పనిచేశారు. అయితే నాన్న బాటలోనే అడుగులు వేస్తూ నేను కూడా వైద్యవృత్తిని ఎంచుకున్నానని, పన్నెండేళ్ల నుంచి డాక్టర్‌గా పనిచేస్తున్నానని, నాన్నగారి స్పూర్తితోనే సినిమాలపై ఆసక్తి మొదలైందని, ఆ ఆసక్తితోనే ఈ చిత్రంలో తాను నటించానని రంజిత్ చెప్పుకొచ్చారు.

ఇందులో సినీ రచయితగా నా పాత్ర విభిన్నంగా ఉంటుందని, నిర్మాతల్ని మెప్పించే మంచి కథ రాయడం కోసం రచయిత తన కుటుంబంతో కలిసి ఓ ఇంటికి వెళ్ళిన అతడికి అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొత్త పాయింట్‌తో దర్శకుడు వీరాస్వామి సినిమాను తెరకెక్కించారు. గతంలో కన్నడంలో అవధి అనే సినిమాలో హీరోగా చేశానని, ఆ సినిమాకు వీరాస్వామి కో డైరెక్టర్‌గా పనిచేశారని, అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఏర్పడిందని అన్నారు. వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే తీర్చిదిద్దారని, గంట యాభై నిమిషాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని అన్నారు.

ఏప్రిల్ 28 మంచి చాలా మంచి రోజు అని ఓ సందర్భంలో హాస్యనటుడు అలీకి ఈ సినిమా గురించి చెప్పాను. టైటిల్ విని ఆయన ఏప్రిల్ 28న అడవిరాముడు, యమలీల, బాహుబలి, పోకిరి లాంటి గొప్ప సినిమాలు విడుదలయ్యాయని అన్నారని, అలాంటి మంచి రోజు మా సినిమాకి టైటిల్‌గా కుదరడం ఆనందంగా ఉందని, కథానానుగుణంగా ఈ సినిమాలో ఏప్రిల్ 28కి చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చారు.

నాకు హీరో నిఖిల్, సోహెల్‌తో చాలా కాలంగా పరిచయముందని,
నిఖిల్ సినిమా చూసి ఇప్పటివరకు నేను చూసిన గొప్ప ఇంట్రవెల్ బ్యాంగ్ ఇదేనని ప్రశంసించారని, సోహెల్‌కు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, మంచి సినిమాను ప్రోత్సహించేందుకు వారిద్దరూ ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు.

అయితే సినిమాల్లో నటించినా నా వైద్యవృత్తికే తొలి ప్రాధాన్యత అని, హీరోగా మాత్రమే నటించాలనే పరిమితులు పెట్టుకోలేదని, పాత్రకు ప్రాముఖ్యత ఉందనిపిస్తే విలన్‌గా నటించడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు. సినిమాల పట్ల నాలో ఉన్న ఇష్టాన్ని గుర్తించిన అమ్మనాన్నలు నన్ను ప్రోత్సహించారని, వైద్యవృత్తిని వదులుకోకుండా సినిమాలు చేయమని వారు నాకు సలహా ఇచ్చారని అన్నారు.

సీనియర్ నటులైన తనికెళ్లభరణి, అజయ్, రాజీవ్‌కనకాల వంటి మంచి అనుభవజ్ఞులతో కలిసి పనిచేశానని వారి సహకారం వల్లే ఈ సినిమాలో నా పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగానని, తనికెళ్లభరణితో కలిసి నటించిన సన్నివేశాలన్నీ సింగిల్ టేక్‌లోనే పూర్తిచేశానని, హావభావాల విషయంలో అజయ్ చక్కటి సలహాలిచ్చారని, ఈ సినిమా విడుదల తర్వాతే కొత్త చిత్రాలను అంగీకరించాలనే ఆలోచనలో ఉన్నానని, సొంతంగా తానే కొన్ని కథలు రాశానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు