‘ప్రభాస్ – నాగ్ అశ్విన్’ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘ప్రభాస్ – నాగ్ అశ్విన్’ సినిమా పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 20, 2020 2:00 AM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట. కాబట్టి, సహజంగానే, ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ కోసం 50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఈ చిత్రం కోసం విఎఫ్ఎక్స్ చేయటానికి అతిపెద్ద సాంకేతిక నిపుణులలో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు