లండన్‌‌కు వెళ్లనున్న ప్రభాస్, అనుష్క

లండన్‌‌కు వెళ్లనున్న ప్రభాస్, అనుష్క

Published on Jul 24, 2019 9:47 PM IST

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1, 2’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల వసూళ్లతో పాటు చిత్రానికి అనేక రకాలుగా గౌరవం దక్కగా తాజాగా మరొక గౌరవం కూడా దక్కనుంది. అదేమిటంటే లండన్‌‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ ‘బాహుబలి – ది బిగినింగ్’ను ప్రీమియర్ రూపంలో ప్రదర్శించనుంది.

ఇక్కడ విశేషమేమిటంటే చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతాన్ని సింఫనీ ఆర్కెస్ట్రా సినిమాతో పాటే లైవ్ ప్లే చేయనుంది. అంతేకాదు ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు ప్రభాస్, అనుష్క, రానా కూడా హాజరై అక్కడి ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్నారు. అంటే మరోసారి బాహుబలి టీమ్ మొత్తాన్ని ఒకే వేదికపై చూడొచ్చన్నమాట. ఇకపోతే ఈ వేడుక అక్టోబర్ 19న జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు