బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సౌండ్ చేయబోతున్న ‘బాహుబలి’

బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సౌండ్ చేయబోతున్న ‘బాహుబలి’

Published on Apr 28, 2025 9:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కి వరల్డ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ భారీ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు. ఇక నేటికి ‘బాహుబలి 2’ రిలీజ్ అయ్యి 8 ఏళ్లు పూర్తయింది.

ఈ సందర్భంగా మేకర్స్ ఓ సాలిడ్ ప్రకటన చేశారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచి, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోవడంతో ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో బాహుబలి చిత్రాన్ని అక్టోబర్ నెలలో గ్రాండ్ రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే, ఈసారి కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉండబోతున్నాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ‘బాహుబలి’ రీ-రిలీజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు