ఫోటో మూమెంట్ : పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన బాలకృష్ణ

ఫోటో మూమెంట్ : పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ఫ్యామిలీతో పాటు వెళ్లిన బాలకృష్ణ

Published on Apr 28, 2025 7:09 PM IST

Balakrishna And Family

భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులలో సినిమా రంగానికి తన సేవలను అందించిన నందమూరి బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం నాడు ఢిల్లీలో ఈ పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పద్మ అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి నందమూరి బాలకృష్ణ తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఆయన సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతేజ్, ఇద్దరు కుతుళ్లు అల్లుళ్లు.. నారా బ్రాహ్మణి – నారా లోకేశ్.. తేజస్విని – భరత్‌లతో పాటు తన సోదరి నారా భువనేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లారు.

పద్మభూషణ్ అవార్డును స్వీకరించే ముందు తన ఫ్యామిలీతో కలిసి బాలయ్య ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు