తిత్లీ బాధితుల‌కు బాలయ్య 25 లక్షలు విరాళం !

తిత్లీ బాధితుల‌కు బాలయ్య 25 లక్షలు విరాళం !

Published on Oct 17, 2018 4:59 PM IST

‘తిత్లీ’ బీభత్సం కారణంగా సిక్కోలులోని ప్రజలు గత కొని రోజులుగా తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోతుతున్న విషయం తెలిసిందే. వారి బాధకి తెలుగు సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ రూ.25 లక్షల పెద్ద మొత్తాన్ని విరాళంగా ప్రకటించి తిత్లీ బాధితుల‌కు అండగా నిలబడ్డారు.

కాగా ఇప్పటి వరకు సినీ రంగం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50 వేలు డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.లక్ష ను మరియు నిఖిల్, వరుణ్ తేజ్ తిత్లీ బాధితుల‌కు సహాయార్ధం కొరకు విరాళాలు ప్రకటించి.. సిక్కోలులోని ప్రజలకు కష్టకాలంలో తోడుగా నిలబడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు