ఎలక్షన్స్ అయ్యాకే షూటింగ్ !

ఎలక్షన్స్ అయ్యాకే షూటింగ్ !

Published on Feb 17, 2019 7:06 PM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రం ఈ నెలాఖర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అలాగే ‘మే’ నుండి రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ పూర్తి అయ్యాక షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఇక ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్య క్రమాలను జరుపుకుంటుంది.

కాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లోనే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆద్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తీయనున్నాడు బోయపాటి. మరి గతంలో బాలయ్యకి ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, ఈ సారి అలంటి సూపర్ హిట్ ని ఇచ్చి.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి. ఆయితే ఈ కొత్త చిత్రం పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగనుందని.. రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందని.. అలాగే బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర అని గతంలో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి.

తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు