‘బందోబస్త్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమిని.

‘బందోబస్త్’ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమిని.

Published on Jul 11, 2019 12:03 AM IST

స్టార్ హీరో సూర్య,మోహన్ లాల్ ,ఆర్య, సయేశా వంటి భారీతారాగణంతో దర్శకుడు కే వి ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ “బందోబస్త్”. సూర్య స్పెషల్ కమాండో ఆఫీసర్ గా నటిస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మొదటిసారి ప్రధాన మంత్రి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు,తమిళ, మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది.

ఐతే మూవీ సాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్ వర్క్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఈ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. హరీష్ జయ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు