రొమాంటిక్ హీరోగా మారనున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ !

రొమాంటిక్ హీరోగా మారనున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ !

Published on Oct 23, 2018 3:13 PM IST


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్లు కావడంతో మొదటిసారి ఒక పూర్తి స్థాయి ప్రేమకథ చిత్రంలో నటించాలనుకుంటున్నాడట ఈ యువ హీరో. దాంట్లో భాగంగా రమేష్ వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇ చ్చాడట. అభిషేక్ అగర్వాల్ ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు.

ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. దాంట్లో ఒకటి నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన 5వ చిత్రంలో నటిస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇక ఈచిత్రంతో పాటు సాయి, తేజ దర్శకత్వంలో తన 6వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో కూడా కాజలే హీరోయిన్ కావడం విశేషం. ఈరెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత రమేష్ వర్మ చిత్రాన్ని మొదలపెట్టనున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు