వీళ్ల ఆశలు ‘భీష్మ’ తీరుస్తాడా ?

వీళ్ల ఆశలు ‘భీష్మ’ తీరుస్తాడా ?

Published on Jul 17, 2019 3:00 AM IST

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర బలంగా ఉంటుందని టాక్. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం నితిన్, ‘భీష్మ’తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రంలో అదే విధంగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు