మనసులో మాటను బయట పెట్టిన కౌశల్ !

మనసులో మాటను బయట పెట్టిన కౌశల్ !

Published on Oct 17, 2018 11:42 AM IST


‘బిగ్ బాస్ సీజన్ 2’లో మొదట ఓ చిన్నస్థాయి సెలెబ్రెటీగా ఎంటర్ అయిన కౌశల్, హౌస్ లో తన బిహేవియర్ తో నెటిజన్ల మనసును గెలుచుకున్నాడు. దాంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ గ్రూపుల పేర్లతో కౌశల్ కు విపరీతంగా తమ సపోర్ట్ ని తెలుపుతూ వచ్చారు. దాంతో మొత్తానికి కౌశల్ ‘బిగ్ బాస్ సీజన్ 2’ ముగిసే సరికి ఓ స్టార్ స్టేటస్ సంపాధించుకోవడంతో పాటు, టైటిల్ ను మరియు 50 లక్షల బహుమతిని కూడా గెలుచుకున్నాడు.

అయితే కౌశల్ ఆ రూ.50 లక్షలను క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రజల సంక్షేమానికి విరాళంగా ఇస్తున్నట్లు అప్పుడే ప్రకటించాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో కౌశల్ తన భవిష్యతు ప్రణాళిక గురించి మాట్లాడుతూ.. తానూ హీరోగా రావాలని నటించాలని కోరుకుంటున్నాని తెలిపాడు. నటుడిగా నా విలువను నిరూపించుకోవటానికి మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని, రామ్ చరణ్ ధృవ సినిమాలో అరవింద్ స్వామి పోషించిన పాత్ర లాంటివి తానూ పోషించాలనుకుంటున్నట్లు కౌశల్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు