బాలీవుడ్ నటులకు సరైన యాదార్ధ కధను తెరకెక్కించి వారికి కాసుల వర్షం కురిపించగల సత్తా ఇండియన్ క్రికెట్ కెప్టైన్ మహేందర్ సింగ్ ధోనీకి వుందని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అంతా ఆయన అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది
ఇప్పుడు ధోనీ అభిమానులందరికీ ఒక శుభవార్త. ధోనీ జీవితచరిత్రపై ఒక సినిమా తెరకెక్కనుంది. సాధారణ రైల్వే ఉద్యోగినుండి భారతదేశానికి ప్రపంచకప్ సాధించగలిగిన సందర్భం వరకూ ఇందులో వర్ణించనున్నారు. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టైటిల్ రోల్ పోషించనున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 2015లో మనముందుకు రానుంది


