ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB29 కూడా ఒకటి. ఈ సినిమాను రాజమౌళి నెక్స్ట్ లెవెల్లో చిత్రీకరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా కోసం నిర్మాత ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ను కేటాయించారట. అయితే, ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.200 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని.. ఇది మహేష్ బాబు రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ను ఆఫ్రికాలో షూటింగ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో మహేష్ బాబు చేసే అడ్వెంచర్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.