మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రాన్ని మార్చి19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పైన పటారం’ అనే మాస్ సాంగ్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
కాగా ”పైన పటారం” ఐటమ్ సాంగ్ లో మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు హీరో కార్తికేయ – యాంకర్ అనసూయ సిద్ధమయ్యారు. ఆ మాస్ సాంగ్ ప్రోమోని ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు.