నటి ఛార్మి కౌర్, డైరెక్టర్ పూరి జగన్నాద్ కొన్నాళ్లుగా కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో వీరిద్దరూ గతంలో ఆకాష్ పూరి హీరోగా “మెహబూబా” చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇదే బ్యానర్ పై రామ్ హీరోగా తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” ఈనెల 18న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా పాల్గొంటున్నారు.
కాగా ఇప్పుడు ఈ జంట మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టబోతున్నారు. బి ఇస్మార్ట్ అనే బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేయబోతున్నట్లుగా ఛార్మి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. త్వరలోనే ఈ సంస్థ కు సంబంధించి ఓ వెబ్ సైట్ కూడా ప్రారంభించబోతున్నారట. అంతే కాదండోయ్, ప్రతి కస్టమర్ మొదటి కొనుగోలుపై 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామంటూ ఆఫర్ కూడా ముందే ప్రకటించేసింది ఛార్మి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఛార్మి, నటనకు బై చెప్పేసి బిజినెస్ విమెన్ గా ఎదగాలన్న తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ.
BE ISMART men’s clothing brand .. website launching soon ., https://t.co/wd8jugWy9H
register now n on ur 1st orders get 30% discount :hugging_face::hugging_face:@purijagan @puriconnects @IamVishuReddy #PCproduct pic.twitter.com/U5Kpj78WMs— Charmme Kaur (@Charmmeofficial) July 8, 2019