రేపు క్రేజీ అప్‌ డేట్ తో రాబోతున్న క్రాక్ !

రేపు క్రేజీ అప్‌ డేట్ తో రాబోతున్న క్రాక్ !

Published on Feb 12, 2020 8:01 PM IST

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సంగీతానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ రేపు రాబోతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో గోపీచంద్ మ‌లినేని, థమన్, రవితేజ వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు మంచి విజయం సాధించింది.

ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు