ధన్‌శ్రీ ఆర్ట్స్ నిర్మాణంలో కొత్త చిత్రం ప్రారంభం !

ధన్‌శ్రీ ఆర్ట్స్ నిర్మాణంలో కొత్త చిత్రం ప్రారంభం !

Published on Oct 16, 2018 10:31 AM IST


ధన్‌శ్రీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.ఎస్. మూర్తి స్వీయ దర్శకత్వంలో అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం జరువుకుంది. ఈ చిత్రానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు.

అనంతరం రామసత్యనారాయణ మాట్లాడుతూ సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మూర్తి. మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మాతగా, దర్శకుడుగా మారి ఈ నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యానిమేషన్ తరహా చిత్రం కావున అందరికీ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు అయిన ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ ఇంతవరకూ తెలుగులో అంతగా ఉపయోగించని 2డి, 3డి మరియు మోషన్ క్యాప్చర్ విధానాలతో లైవ్ కమ్ యానిమేషన్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. అందుకు సరిపోయే మంచి కథను తయారు చేసుకొని స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఈ సినిమాను ప్రారంభించడం జరిగింది. 3 షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేశాము. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు