రజినీకాంత్ తో కలిసిన దీపిక పదుకొనే

రజినీకాంత్ తో కలిసిన దీపిక పదుకొనే

Published on Apr 21, 2012 11:09 AM IST


తన రాబోతున్న చిత్రం “కోచాడియన్” చిత్ర చిత్రీకరణ కోసం దీపిక కేరళ వెళ్ళారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం త్రివేండ్రం వెళ్ళిన ఈ చిత్ర బృందంతో దీపిక కలిశారు. గత నెల ఈ చిత్రంలో ప్రధాన భాగాన్ని లండన్ పైన్ వుడ్ స్టూడియోస్ లో చిత్రీకరించారు. “ఏ జవాని హాయ్ దివానీ” చిత్ర చిత్రీకరణలో బిజీగా ఉన్న దీపిక ఈ చిత్రీకరణ పాల్గొనలేదు. చిత్ర బృందం కేరళ చేరుకున్నాక దీపిక “ఏ జవాని హాయ్ దివానీ” దర్శకుడు అయాన్ ముఖర్జీ అనుమతి తీసుకొని ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ మద్యనే సౌందర్య రజినీకాంత్ ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల అవుతుందని ప్రకటించారు దీనికోసం ఈ చిత్ర బృందం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కే ఎస్ రవి కుమార్ కథ అందించగా శోభన,శరత్ కుమార్,ఆది,రుక్మిణి మరియు నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు