‘ఎవరు’ చూడని సన్నివేశం, చూస్తారా…!

‘ఎవరు’ చూడని సన్నివేశం, చూస్తారా…!

Published on Aug 23, 2019 1:10 PM IST

ఎవరు చిత్రానికి వస్తున్న ఆదరణ దృష్ట్యా చిత్ర యూనిట్ విడుదలై రెండు వారాలు దగ్గిర పడుతున్నా ప్రచారం కల్పిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం ఎవరు చిత్రం నుండి తొలగించబడిన ఒక సన్నివేశం విడుదల చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ అడివి శేషు, కానిస్టేబుల్ మధ్య ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ సాగిన ఆ సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. మూవీ నిడివి రీత్యానో, మరే ఇతర కారణాలతో ఈ సన్నివేశం చిత్రం నుండి తొలగించినట్లున్నారు.

పివిపి పతాకంపై పరం వి పొట్లూరి, పెర్ల్ వి పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని వెంకట్ రాంజీ తెరకెక్కించగా, శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అడివి శేషు తో పాటు, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు