చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ధమ్కీ’ !

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ధమ్కీ’ !

Published on Jul 20, 2019 1:01 AM IST

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాత గా తెరకెక్కిన చిత్రం ధమ్కీ.. రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వం వహించారు.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. రచయిత శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ సినిమా కి ఎస్.బి ఆనంద్ సంగీతం, దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..

ఈ సందర్భంగా.. దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ… “ధమ్కీ చిత్రం వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ . ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అన్నారు. చిత్ర నిర్మాత సత్య నారాయణ సుంకర మాట్లాడుతూ… మా బ్యానేర్ లో యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ధమ్కీ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర విజయం పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీ ని ప్రకటిస్తాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు