‘చిరంజీవి, వెంకటేష్’తో నటించిన పిల్లాడు.. ఇప్పుడు డైరెక్టర్ కమ్ హీరో !

‘చిరంజీవి, వెంకటేష్’తో నటించిన పిల్లాడు.. ఇప్పుడు డైరెక్టర్ కమ్ హీరో !

Published on Oct 21, 2018 2:26 PM IST


నెంబర్ వన్ సినిమాతో 1993లో సినిమాల్లొకి బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చి అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, నుంచి “జయం” వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన దిలీప్ కుమార్ సళ్వాడి హీరోగా మారి తెలుగు మరియు తమిళం, మళయాళ బాషల్లో సినిమాలు చెస్తున్నాడు. కాగా తాజాగా దిలీప్ నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకున్నాడు.

కాగా దిలీప్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ “దిక్సూచి” చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని , నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దిలీప్ కుమార్ సల్వాడి మాట్లాడుతూ.. బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేను, ఈ ఏడాది నటుడిగా 25సం.లను పూర్తి చెసుకొవటం సంతోషంగా ఉంది. ఇక ఈ తరహా కథాంశంతో ఇప్పటివరకూ తెలుగులో సినిమా రాలేదు. మూడు జోనర్స్ మిక్సింగ్ గా రూపొందిన సినిమా ఇది. త్వరలోనే సినిమాను విడుదల చెస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు