ఆ రెండు సినిమాలను నైజాం లో విడుదల చేయనున్న దిల్ రాజు !

ఆ రెండు సినిమాలను నైజాం లో విడుదల చేయనున్న దిల్ రాజు !

Published on Feb 20, 2019 5:11 PM IST

ప్రముఖనిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు త్వరలో విడుదలకానున్న రెండు సినిమాల నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. అందులో ఒకటి మజిలీ కాగా మరొకటి జెర్సీ. ఈ రెండు కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నవి కావడం విశేషం. నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న మజిలీ చిత్రం ప్రస్తుతం తుది దశ షూటింగ్ ను జరుపుకుంటుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది.

ఇక నాని నటిస్తున్న ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఫై కూడా మంచి అంచనాలు వున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా కూడా ఏప్రిల్ 5న విడుదలకానుందని తెలుస్తుంది. అయితే ఈ విడుదల తేదీ ఫై మరి కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది.

మరి ఇటీవల ఎఫ్ 2తో భారీ లాభాలను చవి చూసిన దిల్ రాజు ఈరెండు చిత్రాలతో కూడా లాభాలను రాబట్టుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు