“మహానటి” దర్శకుడు మూవీ మొదలయ్యేదెప్పుడు?

“మహానటి” దర్శకుడు మూవీ మొదలయ్యేదెప్పుడు?

Published on Jul 10, 2019 11:22 AM IST

దర్శకుడు నాగ్ అశ్విన్ తీసింది రెండు చిత్రాలే అయినప్పటికి టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులలో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన మొదటి చిత్రంగా తీసిన “ఎవడే సుబ్రహ్మణ్యం” కమర్షియల్ గా అంతగా విజయం సాధించకపోయినా కానీ,కాన్సెప్ట్ పరంగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇక లెజెండరీ యాక్టర్ సావిత్రి జీవిత కథను “మహానటి” పేరుతో తెరపై అద్బుతంగా ఆవిష్కరించి తన సత్తా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. “మహానటి” మూవీ కాన్సెప్ట్ పరంగానే కాకుండా కమర్షియల్ గా కూడా రికార్డు వసూళ్లు సాధించి, వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది.

ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంవత్సరం దాటిపోతున్నా ఇంకా మరో మూవీ మొదలుపెట్టలేదు. గతంలో నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయనున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. కానీ సైరా తరువాత చిరు కొరటాల మూవీ చేయనుండటంతో ఆ ఊహాగానాలకు కూడా తెరపడింది. ఇంతవరకు మరో హీరోతో కూడా నాగ్ అశ్విన్ మూవీ ప్రకటించలేదు. మొదటి సినిమా “ఎవడే సుబ్రహ్మణ్యం” 2015లో విడుదల కాగా మూడేళ్ళ తరువాత “మహానటి” చిత్రం 2018లో విడుదల చేశాడు ఈ దర్శకుడు. సినీ అభిమానులు మాత్రం ఆయన సినిమాలకోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే, ఈ దర్శకుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇలాగైతే ఎంత ప్రతిభ ఉన్నా ప్రేక్షకులు మరిచిపోతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు