‘దొరసాని’కి సెన్సార్ పూర్తయింది !

‘దొరసాని’కి సెన్సార్ పూర్తయింది !

Published on Jul 8, 2019 10:37 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘దొరసాని’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెడుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు