కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇటీవలే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. కాగా తాజాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. నాగార్జున తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారట. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయట.
కాగా ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఆడియో విడుదలను త్వరలోనే నిర్వహించడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.