సమంత విడుదల చేయనున్న “ఎవరు” టీజర్..!

సమంత విడుదల చేయనున్న “ఎవరు” టీజర్..!

Published on Jul 18, 2019 11:10 PM IST

హీరో అడివి శేషు,రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ “ఎవరు”. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. రక్తపు మరకలున్న గాజు పలకను చేతిలో పట్టుకొని ఉన్న రెజీనా ఎదురుగా పోలీస్ యూనిఫామ్ లో అడివి శేషు ఇంటెన్స్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి.

కాగా రేపు ఈ మూవీ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే అక్కినేని కోడలు బేబీ సమంత చేతుల మీదుగా రేపు సాయంత్రం 5:30 నిమిషాలకు “ఎవరు” టీజర్ విడుదల కానుంది. నవీన్ చంద్ర,మురళి శర్మ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు