మరోసారి పూరి ధైర్యం బయటపడింది

మరోసారి పూరి ధైర్యం బయటపడింది

Published on Jul 8, 2019 9:02 PM IST

హిట్లు ఉన్నా లేకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకేలా ఉంటారు. ఇప్పటికే ఈ సంగతి పలుసార్లు ఋజువైంది. తాజాగా నిన్న రాత్రి జరిగిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా యొక్క ‘ఇస్మార్ట్ బోనాలు’ వేడుకలో ఇదే సంగతి మరోసారి ఋజువైంది. దర్శకుడు పూరి జగన్నాథ్ వేదికపై మాట్లాడుతూ తన పరాజయాల్ని అందరి ముందు ఒప్పుకున్నారు.

2015లో చేసిన ‘టెంపర్’ తర్వాత పూరి ‘లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా’ సినిమాలు చేశారు. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ పరాజయాలే. ఈ నిజాన్నే పూరి మొహమాటం లేకుండా ఒప్పేసుకున్నారు. ‘టెంపర్’ తర్వాత నాకు సరైన హిట్ లేదన్న ఆయన ఆకలిమీదున్న నాకు రామ్ దొరికాడు. ఈ సినిమా పెద్ద హిట్టై డబుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలనేదే నా కోరిక అంటూ మాట్లాడారు.

ఈ మాటలు విన్న జనం తన సినిమాలు పోయాయని నేరుగా ఒప్పుకునే ధైర్యం దర్శకుల్లో వర్మ తర్వాత పూరికే ఉందని పొగుడుతున్నారు. అంతేకాదు 18న వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆయనకు విజయాన్ని ఇవ్వాలని కొరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు