ఫస్ట్ సాంగ్ తో రానున్న ‘మిస్టర్ మజ్ను’ !

ఫస్ట్ సాంగ్ తో రానున్న ‘మిస్టర్ మజ్ను’ !

Published on Dec 13, 2018 12:57 PM IST


‘అఖిల్ , హలో’ చిత్రాల తరువాత యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ ఫై భారీ ఆశలు పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం నుండి ‘ఏమైనదో’ అనే మొదటి సాంగ్ ను ఈ నెల 14న ఉదయం 9గంటలకు విడుదలచేయనున్నారు.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుంది.

మరి ఈ చిత్రంతో అఖిల్ మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. అయితే అఖిల్ మాత్రం ఈ చిత్రం ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ఈ నెల 25న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు